న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిపై చర్చించడానికి కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ మంగళవారం భేటీ కానుంది. ఈ సమావేశం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాసంలో జరుగుతుందని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా లోక్సభలో పార్టీ నేతగా ఎవరు వ్యవహారించాలన్నది ఇప్పటి వరకు ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయంపై కూడా సీనియర్ నేతలు చర్చించనున్నారు. అయితే రాహుల్ గాంధీయే ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి, పార్టీకి కేటాయించిన సమయాన్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో ఈ సమావేశం నిర్ణయించనుంది.
Mon Jan 19, 2015 06:51 pm