హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఫోన్ కాల్ చేసినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. రాజగోపాల్ రెడ్డి తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే తమ మధ్య జరిగిన సంభాషణను బయటకు చెప్పలేనన్నారు. పార్టీలో మార్పులు అవసరం అని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో పార్టీ పదవుల విషయంలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నట్లు తన మనసులోని కోరికను వెల్లడించారు. పార్టీ బలోపేతంపై కార్యకర్తలు పూర్తి స్పష్టతతో ఉన్నారని, నేతలే కన్ఫ్యూజన్లో ఉన్నారని పేర్కొన్నారు. అవకాశం వస్తే పార్టీ బలోపేతానికి కృష్టి చేస్తానని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm