హైదరాబాద్ : జడ్టీఈకి చెందిన నూబియా సబ్బ్రాండ్.. రెడ్ మ్యాజిక్ 3 పేరిట ఓ నూతన స్మార్ట్ఫోన్ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్లను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. అలాగే ఇందులో హీట్ను తట్టుకునేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దీంతో గేమ్స్ ఎక్కువ సేపు ఆడుకున్నా, వీడియోలు చూసినా, నెట్ బ్రౌజింగ్ చేసినా.. ఫోన్ వేడి కాకుండా ఉంటుంది.
ఇక ఈ ఫోన్లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ కూడా ఈ ఫోన్లో ఉంది. దీనికి క్విక్ చార్జింగ్ ఫీచర్ను అందిస్తున్నారు. అందువల్ల కేవలం 10 నిమిషాల పాటు ఫోన్ను చార్జింగ్ పెడితే చాలు.. ఏకంగా 1 గంట సేపు గేమ్ ఆడుకునేందుకు కావల్సిన బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్కు చెందిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.35,999 ధరకు లభ్యం కానుండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.46,999 ధరకు లభ్యం కానుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ఫోన్ను ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో విక్రయించనున్నారు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందివ్వనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 17,2019 09:20PM