న్యూఢిల్లీ: ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా మాన్సూన్ సేల్తో ముందుకొచ్చేసింది. జూలై 3 నుంచి సెప్టెంబరు 26 మధ్య ప్రయాణించే వారు ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. నేడు ప్రారంభమైన ఈ ఆఫర్ రేపు (బుధవారం) అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగా రూ. 1299కే టికెట్ను ఆఫర్ చేస్తోంది. బుధవారం అర్ధ రాత్రి 11:59 గంటల వరకు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆఫర్ ముగిసిపోతుంది. ఇటీవల వచ్చి చేరిన 62 కొత్త విమానాలతో కలిసి విస్తారా విమానాల సంఖ్య 170కి చేరుకుంది. మొత్తం 24 గమ్యస్థానాలకు రోజూ విమానాలు నడుపుతోంది. ముంబై నుంచి పది నగరాలు అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, వారణాసి, అమృత్సర్, ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాలకు విస్తారా నేరుగా సర్వీసులు అందిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm