హైదరాబాద్: పంజాగుట్టలో ధర్నా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతర రావుపై కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులతో అసభ్యకరంగా మాట్లాడారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆయనపై ఐపీసీ 143, 153ఏ, 353,188, రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వీహెచ్ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. దీనికి ముందు ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించారు. వీహెచ్కు బీపీ, షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఆయన అరెస్ట్పై పోలీసులు సందిగ్ధంలో ఉన్నారు. పంజాగుట్ట సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వీహెచ్ తన అనుచరులతో ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోబోయారు. ఈ సమయంలో పోలీసులకు, వీహెచ్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులతో వీహెచ్ దుర్భాషలాడారు. దీంతో పోలీసులు ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. వీహెచ్తో పాటు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm