హైదరాబాద్: మహారాష్ట్ర లోని బండార జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాకోలి నుంచి లాకందుర్ కు వెళ్లే మార్గంలో ఓ బొలేరో వాహనం అదుపుతప్పి బోల్లా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. లాకందూరు తాలుకా చుల్బందు నది వంతెనపైకి రాగానే బొలేరో వాహనం టైర్ పేలింది. దీంతో అదుపు తప్పిన వాహనం కిందపడిపోయింది. వంతెనపై నుంచి కిందపడడంతో వాహనం నుజ్జునుజ్జ అయింది. ఘటనాస్థలంలోనే ఏడుగురు మృతి చెందగా, మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను చికిత్స కోసం సాకోలి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm