హైదరాబాద్: ప్రజలకు భద్రత కల్పించడంతోపాటు వారిని రక్షించాల్సిన బాధ్యత పోలీసులదే. పోలీసులు తమ భాద్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే పోలీసులపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. అయితే తమ విధితోపాటు నీళ్లలోకి దూకి చావాలని ప్రయత్రించిన ఓ మహిళను కాపాడి నిజమైన పోలిస్ అనిపించున్నాడు వాజేడు ఎస్ఐ క్రిష్ణ ప్రసాద్. మండలంలోని తాళ్ళగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ పర్వతం మల్లేశ్వరీ.. ముల్లకట్ట బ్రిడ్జ్ పై నుంచి నీళ్లలోకి దూకి ఆత్మహత్య ప్రయత్రం చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన వాజేడు ఎస్ఐ క్రిష్ణ ప్రసాద్ వెంటనే నీళ్లలోకి దిగి మహిళను రక్షించాడు.
Mon Jan 19, 2015 06:51 pm