హైదరాబాద్: సినీనటి మెహరీన్ హైదరాబాద్లో మెరిసింది. బంజారాహిల్స్లోని ఓ నగల దుకాణంలో కొత్త కలెక్షన్స్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిలకు బంగారు అభరణాలంటే చాలా ఇష్టమని.. నగలు ధరిస్తే మరింత అందంగా ఉంటారని చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడం, హిందీ.. ఇలా నాలుగు భాషా చిత్రాల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా నటిస్తున్న 'చాణక్య' చిత్రంతో పాటు కళ్యాణ్రామ్, ధనుష్ తదితర హీరోల చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ధగధగ మెరిసే నూతన అభరణాల్లో మెహరీన్ మెరిసిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm