న్యూఢిల్లీ: ఈ సాయంత్రం 6:52 గంటలకు జపాన్లోని ఈశాన్య ఐలండ్ హొన్షును భూకంపం కుదిపేసింది. 6.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వీధుల్లోకి వచ్చి పరుగులు తీశారు. సముద్రపు అలలు అంతెత్తున ఎగసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం యమగట, నిగట జిల్లాలకు సునామీ హెచ్చరికలు జారీచేసింది. అలాగే, ఇషికావా జిల్లాలోని నోటో ప్రాంతానికి హెచ్చరికలు చేసింది. భూకంపం కారణంగా సంభవించిన నష్టం విలువ ప్రస్తుతానికి తెలియరాలేదు. జపాన్ సముద్రంలో ఏడు మైళ్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm