హైదరాబాద్ : సెక్రటేరియట్ భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని కట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సెక్రటేరియట్ భవనాన్ని ఉన్న చోటునే కట్టాలని నిర్ణయించామని చెప్పారు. 5-6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సచివాలయం కడతాం. రూ.400 కోట్ల వ్యయం లోపే సచివాలయం పూర్తవుతుంది. రూ.100 కోట్ల ఖర్చుతో అసెంబ్లీ పూర్తవుతుంది. ఇప్పుడున్న అసెంబ్లీని హెరిటేజ్ భవనంలా కాపాడుతాం. తూర్పు ముఖంగా అసెంబ్లీ నిర్మాణం చేపడతాం. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ఈ నెల 27న భూమి పూజ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. పీఆర్సీ పెంపు, రిటైర్ మెంట్ వయసు పెంపుపై త్వరలో ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతమని సీఎం కేసీఆర్ స్ఫష్టం చేశారు. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. నూతన మున్పిపల్ చట్టం తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జులైలోగా మున్సిపల్ ఎన్నికలు ముగిసేలా చూస్తాం. తెలంగాణ డైరెక్టర్ ఎన్ శంకర్ కు స్డూడియో కోసం హైదరాబాద్ శివారులో 5 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించాం. విశాఖ శారదాపీఠానికి రెండు ఎకరాలు కేటాయించాలని నిర్ణయించామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm