కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించిన 30 శాతం ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. ఎన్నికల సమయంలో ఈవీఎంలు మోరాయించినప్పుడు వాటిస్థానంలో అధికారులు కొత్తవాటిని ఏర్పాటు చేశారన్నారు. అయితే కొత్త ఈవీఎంలను మార్చేటప్పుడు వాటిల్లో మాక్ పోలింగ్ నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ముందుగానే ఓట్లను నిక్షిప్తం చేసిన ఈవీఎంలను పనిచేయనివాటి స్థానాల్లో మార్చలేదనడానికి ఆధారాలేంటని ఆమె ప్రశ్నించారు. కాగా.. త్వరలో బెంగాల్లో జరగబోయే పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలనే వాడాలని ఈసీకి సూచించనున్నట్టు దీదీ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm