హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితులకు ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 12న విచారణకు హాజరుకావాలని 12 మంది నిందితులను ఆదేశించింది. కోనేరు రాజేంద్రప్రసాద్, కోనేరు మధు, కోనేరు ప్రదీప్, తుమ్మల రంగారావు, సునీల్రెడ్డి, శ్రీకాంత్ జోషి, విజయ రాఘవ, ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్, ఎమ్మార్ ఎంజీఎఫ్, స్టైలిష్ హోమ్స్, ఆసరా థీమ్ ప్రాజెక్ట్, సౌత్ అండ్ ప్రాజెక్ట్స్కు సమన్లు జారీ చేసింది. విచారణ నుంచి ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు ఈడీ మినహాయింపునిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm