నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్, జూనియర్ అసిసెంట్ రాజేందర్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. గత కొన్నేండ్లుగా వీరిపై విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇటీవల ఆర్జేడీ విచారణ చేపట్టి నివేదికను దేవాదాయశాఖ కమిషన్కు అందించారు. దీనిపై మంగళవారం కమిషనర్ ఆదేశాల మేరకు ఏఈవో గంగాశ్రీనివాస్, రాజేంద్ర్ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన రాజేందర్ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి ఎక్కడి వెళ్లరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm