విశాఖ: గీతం విశ్వవిద్యాలయం స్కూల్ఆఫ్ నర్సింగ్ ద్వారా నిర్వహిస్తున్న బీఎస్సీ నర్సింగ్ కోర్సులో 2019-20 సంవత్సరానికి గాను ప్రవేశాలకు ఈఏడాది దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కనకలక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్షలలో సైన్స్ సబ్జెక్టులతో 45శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఇంటర్మీడియెట్లో ఒకేషనల్ నర్సింగ్ బ్రిడ్జి కోర్సు 45శాతం ఉత్తీర్ణులైన వారు కూడా ఈప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎమ్మెస్సీ నర్సింగ్ ప్రాక్టీషనర్ ఇన్క్రిటికల్కేర్ కోర్సులో ప్రవేశం పొందగోరేవారు బీఎస్సీ నర్సింగ్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఏడాది వృత్తి అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం వుంటుందని తెలిపారు.మరింత సమాచారం కోసం 0891-2727236, 2866555,9703430511 ,7331136730 ఫోన్ నంబర్లలో సంప్రతించాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm