గుంటూరు: రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో 2019 - 20 విద్యా సంవత్సరానికి బడ్జెట్పై విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 21న సచివాలయంలోని ఫైనాన్స్ కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుందని వర్సిటీ రిజిస్ర్టార్ ఆచార్య జి.రోశయ్య తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ఆచార్య ఎస్.వరదరాజన్ నుంచి వర్సిటీకి లేఖ వచ్చినట్లు తెలిపారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరి ఆధ్వ ర్యంలో జరిగే సమావేశానికి వర్సిటీకి సంబంధించిన బడ్జెట్ ప్ర తిపాదనలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm