అమరావతి: హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, ఎం.వెంకటరమణ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిద్దరితో ప్రమాణం చేయించే బాధ్యతను గవర్నర్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్కు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం 10.55 గంటలకు హైకోర్టు ప్రాంగణంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో న్యాయమూర్తులిరువురూ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm