లక్నో: జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని అనంత్నాగ్ ఎన్కౌంటర్లో మరణించిన ఆర్మీ మేజర్ కేతన్ శర్మ కుటుంబానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.25లక్షల ఆర్థికసాయం ప్రకటించారని యూపీ రాష్ట్ర మంత్రి సురేష్ రానా చెప్పారు. యూపీలోని లక్నో నగరంలోని ఓ రోడ్డుకు అమరుడైన ఆర్మీ మేజర్ కేతన్ శర్మ పేరు పెడతామని మంత్రి సురేష్ రానా చెప్పారు. దీంతోపాటు కేతన్ శర్మ కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm