హైదరాబాద్: నగర శివారులో దారుణం జరిగింది. భార్య భర్తల మధ్య జరిగిన గొడవకు చిన్నారి బలైంది. నాచారం మల్లాపూర్లో నివాసముంటున్న ఓ వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను మూడో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఆమెతో పాటు చిన్నారి కూడా కింద పడిపోయింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా, తల్లి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm