హైదరాబాద్: రాష్ట్రంలో డీఈడీ కళాశాలల్లో సీట్ల భర్తీకి గురువారం నుంచి కౌన్సెలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 22 వరకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి, 23 నుంచి 25 వరకు వెబ్ఆప్షన్ ప్రక్రియ కొనసాగుతుందని డీఈఈసెట్-2019 కన్వీనర్ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 160 డీఈడీ కాలేజీలు ఉండగా, 10,500 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీఈఈసెట్ ఫలితాల్లో 12,500 మంది విద్యార్థులు మాత్రమే అర్హత సాధించినట్టు కన్వీనర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm