కోల్కతా: కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో వైద్యులపై రోగి బంధువులు దాడి చేసి గాయపరిచిన ఘటన మరువకముందే ఢిల్లీలో అటువంటి ఘటనే జరిగింది. ఢిల్లీలోని మహర్షి వాల్మికి ఆసుపత్రిలో వైద్యులపై స్థానికులు దాడి చేశారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బవానా ప్రాంతంలో మంగళవారం నాలుగేళ్ల బాలికపై దాదాపు 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో బాధిత బాలికను పరీక్షల నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగి ఆసుపత్రిలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అదే ఆసుపత్రిలో ఉన్న నిందితుడిపై దాడి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm