హైదరాబాద్: సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు (జూడాలు) నిరవధిక సమ్మె చేయనున్నారు. బోధనాస్పత్రుల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసును పెంచొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఎమర్జెన్సీ సేవలు మినహా ఇతర వైద్య సేవల్లో పాల్గొనబోమని జూడాలు స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm