శ్రీకాకుళం: మందస మండలం మధనాపురంలో విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే పలాస వ్యవసాయ శాఖ సంచాలకులు చల్లా దశరథుడు(50) మృతిచెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm