తిరుమల: తిరుమల ఘాట్లో భక్తులపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ముందస్తు జాగ్రత్త చర్యలపై టీడీపీ అధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఘాట్ రోడ్లో బైకులపై వెళ్లే వారిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే క్రూరమృగాలు సంచరించే ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm