బెంగళూర్:కర్నాటకలో ప్రభుత్వానికి ఎటువంటి ప్రమాదం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్య మంత్రి సిద్ధ రామయ్య అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటకలో ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎటువంటి ముప్పు లేదు, సమస్య లేదు.రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. అయినప్పటికీ వారు విజయం సాధించలేకపోయారని ఎద్దేవ చేసారు.