న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల అనంతరం మొట్టమొదటి సారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం పార్లమెంటు సభ్యులందరికీ విందు ఇవ్వనున్నారు.ఢిల్లీలోని అశోకా హోటల్ లో ఎంపీలకు ప్రధాని విందు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన విందుకు హాజరు కావాలని కోరుతూ లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ కేంద్రం పక్షాన పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానాలు పంపించారు. 17వ లోక్ సభ ఏర్పాటయ్యాక మొదటిసారి మోడీ బుధవారం అఖిలపక్షాల నేతల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గురువారం మోడీ ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఈ విందులో విపక్షాలకు చెందిన ఎంపీలు పాల్గొంటారా ? లేదా అనేది వేచిచూడాల్సిందే.
Mon Jan 19, 2015 06:51 pm