గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఈరోజు ఘర్షణ చోటుచేసుకుంది జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరులో 'మీ సేవా' కేంద్రం ఏర్పాటు అయింది. అయితే దీన్ని మేం నిర్వహిస్తాం.. అంటే మేం నిర్వహిస్తాం అని వైసీపీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి వాదులాడుకున్నారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్తా హద్దుదాటడంతో రెండు గ్రూపులు కర్రలు, రాళ్లతో దాడిచేసుకున్నాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, బాధితుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 19,2019 11:07AM