అమరావతి: ముఖ్యమంత్రి జగన్ శాసనసభను పక్కదోవ పట్టించి సభలో అవాస్తవాలు చెప్పారని టీడీనీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. మీడియా పాయింట్ వద్ద విలేకరులతో అచ్చెన్నాయుడు మాట్లాడారు. సభలో ఏం జరుగుతోందో ముఖ్యమంత్రికి తెలియదని ఆయన అన్నారు. వడ్డీ లేని రుణాలపై సీఎం సభలో అవాస్తవాలు చెప్పారని ఆయన అన్నారు. టీడీపీ సభ్యులను అవమానించేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm