హైదరాబాద్: మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ప్రత్యేక అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇస్తున్నది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి, పురపాలకశాఖ సంచాలకులు శ్రీదేవి అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm