న్యూఢిల్లి : కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్దేనని సుప్రీంకోర్టు చెప్పింది. అంతే కాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. రేపు జరగనున్న బలపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని ఎవరూ బలవంతపెట్టలేరని వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm