ప్రయాగరాజ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఊరట కల్పించింది. 1999వ సంవత్సరంలో మహరాజ్గంజ్ జిల్లాలో జరిగిన పోలీసు కానిస్టేబుల్ సత్యప్రకాష్ యాదవ్ హత్య కేసులో సీఎం యోగిఆదిత్యనాథ్ నిందితుడు. సీఎంపై కేసు నమోదు చేసినా సీబీసీఐడీ విచారణలో యోగికి హత్య కేసులో ప్రమేయం లేదని తేలింది. దీంతో 2018లో మహరాజ్ గంజ్ సీజేఎం కోర్టు యోగిపై కేసును తిరస్కరించింది. అనంతరం ప్రయాగరాజ్ లోని ఎంపీ,ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు కూడా ఈ కేసును డిస్మిస్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm