హైదరాబాద్: ప్రపంచకప్లో తన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ప్రపంచకప్తోనే ధోనీ క్రికెట్కు గుడ్బై చెప్పేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ధోనీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. జులై మూడు నుంచి జరుగనున్న విండీస్ టూర్కు జట్టును ఎంపిక చేయడానికి శుక్రవారం సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ధోనీ భవితవ్యం గురించి చర్చ మొదలైంది. మరోవైపు ధోనీ రిటైర్మెంట్ గురించి అతని తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆ విషయాన్ని ధోనీ కోచ్ కేశవ్ బెనర్జీ తాజాగా వెల్లడించారు. ధోనీ క్రికెట్కు గుడ్బై చెప్పాలని అతని తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టు కేశవ్ వెల్లడించారు. -గత ఆదివారం నేను ధోనీ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో మాట్లాడాను. ధోనీ ఇక క్రికెట్ను విడిచిపెడితే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. ధోనీ రిటైర్ అయి తమతో పాటు ఇంట్లో ఉండాలని వారు ఆశిస్తున్నారు. ధోనీ మరో ఏడాది పాటు క్రికెట్ ఆడాలని, టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని నేను వారికి చెప్పాను. వారు మాత్రం ధోనీ వెంటనే క్రికెట్ నుంచి తప్పుకుని ఇంటిని చూసుకోవాలని కోరుకుంటున్నార-ని కేశవ్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm