న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ (బీజేపీ) నాయకుడు సుబ్రమణ్య స్వామి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడికి సంచలన లేఖ రాశారు. కొత్తగా రాజ్యసభకు ఎంపికైన ఎండీఎంకే సభ్యుడు వైకో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ హిందీ భాషకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందున అతని రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సుబ్రమణ్యన్ స్వామి ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడికి లేఖ రాశారు. హిందీ భాషకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 351ను ఉల్లంఘించడమేనని అందుకే వైకో పై పెద్దల సభ ఎథిక్స్ కమిటీకి నివేదించాలని స్వామి డిమాండు చేశారు. వైకో అలియాస్ వి. గోపాల స్వామికి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగే అర్హత లేదన్నారు. రైల్వే టైంటేబుల్ ను హిందీ భాషలోనే రైల్వే శాఖ ఎందుకు ముద్రించాలని వైకో ప్రశ్నించి భారతీయులను అగౌరపర్చినందున అతనిపై సస్పెన్షన్ వేటు విధించాలని స్వామి డిమాండు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm