హైదరాబాద్ : ఖమ్మం హాస్టల్లో మృతిచెందిన బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో రూ. 5లక్షల ఆర్ధిక సాయాన్ని అందజేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం ఖమ్మం కలెక్టర్ను కలిసి ఓ వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... మృతిచెందిన బాలిక కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ అందజేయడంతోపాటు మూడు ఎకరాల భూమిని అందజేయాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలలకు ఏవిధంగా కేటాయింపులు చేస్తారో రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లకు కూడా అదేవిధంగా నిధులు కేటాయించాలని క్రిష్ణమాదిగ డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm