జగిత్యాల: ఓవర్ లోడ్తో వెళ్తున్న పల్లె వెలుగు బస్సును రవాణాశాఖాధికారులు సీజ్ చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కొడిమ్యాల నుంచి జగిత్యాల వెళ్తున్న కోరుట్ల బస్సు డిపోకు చెందిన బస్సులో 125 మంది ప్రయాణికులు ఎక్కారు. అయితే... అటుగా రహదారిపై వెళ్తున్న రవాణాశాఖ అధికారికి ఈ విషయం కనబడింది. వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను దించేసి బస్సును సీజ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm