పశ్చిమ గోదావరి: జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. నవయుగ యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవయుగ కార్యాలయం ఎదుట 200 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల ఆందోళనతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కార్మికులతో నవయుగ యాజమాన్యం చర్చలు జరుపుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm