ముంబై: సుప్రీం కోర్టు తీర్పుతో కర్నాటక రాజకీయం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల అంశంపై స్పీకర్దే తుది నిర్ణయమని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. గురువారం విశ్వాస పరీక్ష జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనేది ఎమ్మెల్యేల ఇష్టమని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును రెబల్ ఎమ్మెల్యేలు స్వాగతించారు. తామంతా సమష్టిగానే ఉన్నామని చెప్పారు. రాజీనామాల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లే సమస్యే లేదని రెబల్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm