చిత్తూరు: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కేసీ పెంట గ్రామంలో రైతు పెరుమాళ్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 1.83 సెంట్ల భూమిలో రెండు సార్లు బోరు వేసినా నీటి జడలేదు. దీంతో అప్పులు బాగా పెరిగిపోయాయి. దీంతో అవి తీరే మార్గం కనిపించక పెరుమాళ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm