కృష్ణా : నారాయణ కాలేజ్ మూడవ అంతస్తు నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లు లో చోటు చేసుకుంది. స్థానిక సమాచారం మేరకు.. పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులోని నారాయణ కాలేజ్ లో ఎంపిసి మొదటి సంవత్సరం చదువుతున్న పి.వెంకట సనత్ కుమార్ కాలేజ్ మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే వెంకట సనత్ కుమార్ ను తాడిగడప ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి ఐసియు లో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్ధి గుంటూరు జిల్లా మునంగి గ్రామానికి చెందినవానిగా గుర్తించారు. ఈ విషయమై కాలేజ్ ప్రిన్సిపల్ ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. కంకిపాడు సిఐ, ఎస్ఐ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm