చిత్తూరు: వి.కోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలోని ఆంధ్ర - తమిళనాడు సరిహద్దులో ఓ టెంపో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు మృతి చెందారు. తెల్లవారుజామున 3 గంటలకు ముళబాగల్ నుంచి గుడియాత్తంకు కట్టెల లోడుతో టెంపో బయలుదేరింది. ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు వద్దకు రాగానే అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం చెందారు. ప్రమాదంలో చనిపోయిన వారు గుడియాత్తంకు చెందిన పరందామ, శివలుగా గుర్తించారు. తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm