శ్రీకాకుళం : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం మందస మండలం కొర్రయి గేటు వద్ద చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు మందస మండలం కేశుపురం గ్రామానికి చెందిన వెంకట స్వామి 55 గా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm