హైదరాబాద్ : మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ కె20ని గతంలో చైనా మార్కెట్లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్ను షియోమీ ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చారు. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్కు చెందిన 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.21,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.23,999 గా ఉంది. ఈ ఫోన్ను ఈ నెల 22వ తేదీ నుంచి విక్రయించనున్నారు. రెడ్మీ కె20 స్మార్ట్ఫోన్లో 6.39 ఇంచుల డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm