హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రులు, 30 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యాలయాల నిర్మాణం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే 18, 19 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం నేతలకు దిశా నిద్దశం చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm