న్యూఢిల్లీ: వికృత మెసేజ్లు పంపిస్తూ వేధిస్తున్న భార్య నుంచి విడిపోవాలనుకున్న ఓ భర్తకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేస్తూ విముక్తి కల్పించింది. భార్య తనకు నిత్యం నరకం చూపిస్తోందంటూ సదరు భర్త పంజాబ్ హర్యణా హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తుల ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన కొడుకు మొబైల్ ద్వారా మెసెజ్లు పంపిస్తూ తనకు నరకం చూపిస్తోందని తెలిపాడు. తనకు అక్రమసంబంధాలు అంటగట్టిందన్నాడు. ఆ బంధం కారణంగా తనకు సంతానం కూడా ఉందంటూ వికృతమైన మెసెజ్లు పంపిస్తూ వేధించిందని కోర్టుకు తెలిపాడు. అందరి మూందూ సిగ్గుతో తలవంచుకనేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కోసం ఆహారం కూడా సిద్దం చేసేది కాదని, తల్లిదండ్రులకు దూరంగా ఉండేలా చేసిందని కోర్టుకు తెలిపాడు. కాగా కోర్టు భర్త వాదనతో ఏకీభవించింది. ఇటువంటి చర్యలకు పాల్పడటం, మానసికంగా వేధించడం కూడా ఒక రకమైన క్రూరత్వమే అని వ్యాఖ్యానించింది. ఇంటువంటి వివాహ బంధం నుంచి ఆ భర్తకు విముక్తి పొందే హక్కు ఉందని తెలిపిన కోర్టు అతడికి విడాకులు మంజూరు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm