కోల్కతా : రాష్ట్రంలోని వారందరికీ న్యాయం చేయడం కోసం కట్టుబడి తమ ప్రభుత్వం పని చేస్తోందని, దీనికోసం చట్టాలు రూపొందిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మమతా బెనర్జీ ట్విట్టర్లో ఒక సందేశం పోస్టు చేశారు. ప్రజలకు న్యాయం జరగడం కోసం తమ ప్రభుత్వం మంచి చట్టాలను చేస్తోందని ట్వీట్టర్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 19 మావన హక్కుల కోర్టులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm