గౌహతి: అసోంను కుంభవృష్టితో తలెత్తిన వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలోని 33 జిల్లాలు వరద ముంపును గురికాగా, ఇంతవరకూ మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. 45 లక్షల మందికి పైగా ప్రజలు వరదల కారణంగా దెబ్బతిన్నారు. దీనిపై కేంద్రం వేగంగా స్పందించింది. సహాయక పనులకు గాను తక్షణ సాయంగా కేంద్రం రూ.251.55 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తుల నివారణ నిధికి (ఎస్డీఆర్ఎఫ్)కి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. శీఘ్రగతిన కేంద్ర స్పందించి నిదులు విడుదల చేయడంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాకు అసోం ఆర్థిక మంత్రి హిమాంత బిస్వా శర్మ ఓ ట్వీట్లో కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm