హైదరాబాద్ : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తేౌ అనకాపల్లి-యలమంచిలి జాతీయ రహదారిపై జమధులపాలెం హోటల్ ఆములోద్భవి సమీపంలో అనకాపల్లి నుండి వస్తున్నా కారు డివైడర్ ను డి కొట్టి అదుపు తప్పి తాళ్లపాలెం మీదుగా ద్విచక్ర వాహనంపై వెలుతున్న ఇద్దరు వ్యక్తులను డి కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహానం పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ అతి వేగంమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm