న్యూఢిల్లి : మనీ ల్యాండరింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్పై సమాధానమివ్వడానికి గడువు కావాలని రాబర్ట్ వాద్రా ఢిల్లి హైకోర్టును కోరారు. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం చెప్పాలని హైకోర్టు వాద్రాను ఆదేశించగా ఆయన గడువు కోరారు. వాద్రాకు జస్టిస్ చంద్రశేఖర్ రెండు వారాల గడువు మంజూరు చేశారు. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 26కు వాయిదా వేశారు. కోర్టు నోటీసు జారీ చేసిన సమయంలో వాద్రా దేశంలో లేరని, జూలై 11న ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారని వాద్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm