Some will be lucky. A team of wildlife rescuers get hold of a #Rhino calf in Kaziranga. In the time of disasters. Courtesy WA. pic.twitter.com/d2xqbK1QuG
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 16, 2019
గుహవాటి : భారీ వరదల నేపథ్యంలో అసోంలోని ప్రముఖ వన్యమృగాల పార్కు కజిరంగా 90 శాతం మేర నీటి మునిగింది. కజిరంగా జాతీయ పార్కులో అధిక సంఖ్యలో ఖడ్గమృగాలు ఉంటాయి. అయితే ఓ పిల్ల ఖడ్గమృగం నీటిలో మునిగిపోయింది. బయటకు రాలేకపోతుంది. దీన్ని గమనించిన వన్యమృగ సంరక్షకులు ఆ పిల్ల ఖడ్గమృగాన్ని కాపాడారు. నీటిలో మునిగి ఉన్న ఖడ్గమృగాన్ని కాపాడిన దృశ్యాలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ తన మొబైల్లో బంధించి.. ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. కొందరు అదృష్టవంతులు.. వరద నీటిలో ఉన్న పిల్ల ఖడ్గమృగాన్ని వన్యమృగ సంరక్షకులు కాపాడారు అని ఆయన పేర్కొన్నారు. ఖడ్గమృగాన్ని కాపాడిన వన్యమృగ సంరక్షకులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఖడ్గమృగాలు అత్యధికంగా ఉన్న పార్క్ ఏదంటే.. కజిరంగ నేషనల్ పార్క్ మాత్రమే. మొత్తం 199 వన్యమృగాల సంరక్షణ కేంద్రాలకు 155 కేంద్రాలపై వరద ప్రభావం పడింది అని అసోం అటవీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.