అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ట్విట్టర్ ద్వారా విమర్శించారు. వీసారెడ్డిగారు మీకు తెలియదు, చెప్పినా అర్థం చేసుకోరని బుద్దా విమర్శించారు. సీబీఐ లెక్కలతో చూపిన రూ.43వేల కోట్లేమో తప్పుడు లెక్క అంటారని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్లో పోలవరంపై నీ అనుమానాలన్నీ కేంద్రం తీర్చాక కూడా... పోలవరంలో అవినీతి అంటూ నువ్వు రాసిన లెక్కేమో రైట్ అంటావ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ట్రీట్మెంట్ తీసుకోండని, లెక్కల సంగతి తర్వాత ఆలోచిద్దురని ట్విట్టర్లో బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm