హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హోలీ ఏంజల్స్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్ధి కంగాల సాయిబాబు (15) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితేౌ గోకవరం మండలం బి.రామన్నపాలెం, ఫోక్స్ పేటకు చెందిన సాయిబాబు రాజమండ్రి హోలీ ఏంజల్స్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు. కాగా మంగళవారం రాత్రి హాస్టల్ లో మృతి చెందాడు. కాగా స్కూల్ యాజమాన్యం మృత దేహాన్ని హడావుడిగా స్వగ్రామానికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యుడు ఉండవల్లి గాంధీ బాబు బాలుడి మృతిపై విచారణకు ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm